Celebrities Caste Their Vote in Telangana: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ – హైదరాబాద్ లోని రామ్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు
మంత్రి సీతక్క – ములుగులోని జగ్గయ్యపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – నల్లగొండలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు
Also Read: Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఎంతమందంటే..?
మంత్రి కొండా సురేఖ – పరకాలలోని వంచనగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ – హుస్నాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
మాజీ సీఎం కేసీఆర్ – సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
కేటీఆర్ – బంజారాహిల్స్ లోని నందినగర్ లో కుటంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు
మందకృష్ణ మాదిగ – న్యూశాయంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
ఎంపీ అసదుద్దీన్ – వట్టపల్లి జైన్ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ – జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
హీరో అల్లు అర్జున్ – ఫిలీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు