E-Paper
Advertisement

TSPSC: పేపర్ లీకుకు కేటీఆర్ పీఏకు లింకు!… రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

TSPSC: పేపర్ లీకుకు కేటీఆర్ పీఏకు లింకు!… రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Advertisement

TSPSC: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయ మలుపులు తిరుగుతోంది. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని.. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఏ2 నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ లీడరని.. లీకేజీలో ఆ పార్టీకి సంబంధం ఉందని కేటీఆర్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. పరీక్ష రద్దు చేశామని.. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని.. అభ్యర్థుల కోసం వెబ్‌సైట్లో కోచింగ్ మెటీరియల్.. 24 గంటల పాటు రీడింగ్ రూమ్స్.. లాంటి తాయిలాలు ప్రకటించింది ప్రభుత్వం.

లేటెస్ట్‌గా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి మరింత సంచలన ఆరోపణలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ ఘటనలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని అన్నారు. తిరుపతి స్వగ్రామం మల్యాలలో 100 మంది అభ్యర్థులకు 100కు పైగా మార్కులు వచ్చాయని.. అదెలా సాధ్యం అని ప్రశ్నించారు. కేటీఆర్ పీఏకు.. పేపర్ లీకేజీకి లింకు ఉందని.. ఆ మేరకు తన దగ్గర పక్కా సమాచారం ఉందన్నారు రేవంత్‌రెడ్డి. తనకు వచ్చిన సమచారం ఇంతవరకూ ఎప్పుడూ తప్పుకాలేదని.. అందుకే లీకేజీ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

Advertisement

ఇలా పేరు, ఊరు చెబుతూ.. రేవంత్‌రెడ్డి బహిరంగంగా, పదునైన ఆరోపణలు చేశారంటే.. ఆయనేమీ అల్లాటప్పాగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండరు. పక్కా సమాచారమే ఉండి ఉంటుంది. పకడ్బందీగా దర్యాప్తు జరిపితే.. అసలు నిందితులెవరో తేలుతుంది.. అంటున్నారు నిరుద్యోగులు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×