E-Paper
Advertisement

Revanth Reddy: రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం

Revanth Reddy: రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క సారక్క ఆలయంలో పూజలు చేసి.. యాత్రను ప్రారంభించారు. గద్దెలపై కొలువున్న అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తులాభారంతో తన బరువుతో సమానమైన బంగారాన్ని దేవేరులకు సమర్పించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ పెద్దల సమక్షంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ కు పార్టీ శ్రేణులు అడుగడుగునా నీరాజనం పలికారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టారు. సుమారు రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి జనంలో ఉండనున్నారు. పాదయాత్రలో భాగంగా.. జనం సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంతో వారికి మరింత దగ్గరయ్యేందుకు ఈ యాత్ర చేపట్టారు. ఇవాళ మేడారం నుంచి రామప్ప వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×