E-Paper
Advertisement

Oil: రష్యా చమురు తాగేస్తున్న ఇండియా.. చాలా చీప్ గురూ.. మరి, మనకెందుకు రేట్లు తగ్గట్లే?

Oil: రష్యా చమురు తాగేస్తున్న ఇండియా.. చాలా చీప్ గురూ.. మరి, మనకెందుకు రేట్లు తగ్గట్లే?
Advertisement

Oil: ఉక్రెయిన్, రష్యా వార్. ఆ రెండు దేశాలకు అనేక నష్టాలను, కష్టాలను తీసుకొచ్చింది. కానీ, ఇండియాకు మాత్రం ఓ విషయంలో బాగా లాభం చేసింది. అదే ఆయిల్ కొనుగోలు వ్యవహారం. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతో రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి ప్రపంచదేశాలు. అలా రష్యాను ఆర్థిక ఇబ్బందుల్లో పడేయాలనేది వాటి ప్లాన్. అందుకు విరుగుడుగా.. రష్యా ఆయిల్ తో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. రండి బాబూ రండి.. అతితక్కువ ధరకే ఆయిల్ అమ్ముతామంటూ బిగ్ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ ఆఫర్ ను భారత్ బాగా క్యాష్ చేసుకుంటోంది. రష్యా చమురు ఎవరూ కొనొద్దంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయకుండా.. తక్కువ రేటుకే వస్తోందని మనోళ్లు పెద్ద మొత్తంలో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. ఆ దిగుమతులు రికార్డు స్థాయికి చేరడం లేటెస్ట్ అప్ డేట్.

ఉక్రెయిన్ తో వార్ కు ముందు రష్యా నుంచి ఇండియాకు క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే ఉండేది. గల్ఫ్ కంట్రీస్ పైనే ఎక్కువగా ఆధారపడేది. ఇప్పుడు చీప్ గా వస్తోంది కదాని.. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొంటోంది. దీంతో.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఏకంగా 28 శాతానికి పెరిగాయి. ఒక్కడి 1 శాతం.. ఇంకెక్కడి 28 శాతం. ఈ లెక్క చూస్తుంటే తెలుస్తోందిగా మనోళ్లు రష్యా చమురును తెగ తాగేస్తున్నారని.

Advertisement

రష్యా తర్వాత ఇరాక్‌ (20 శాతం), సౌదీ అరేబియా (17 శాతం), అమెరికా (9 శాతం), యూఏఈ (8 శాతం)ల నుంచి ఇండియా అధికంగా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. రష్యా ఆయిల్‌ను చైనా, భారత్‌ లే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ ను మన అవసరాలకు వాడుకుంటూనే.. ఆ ముడి చమురును శుద్ధి చేసి అమెరికాకు కూడా ఎగుమతి చేస్తోంది ఇండియా. అలా అదనపు ఆదాయం కూడా ఆర్జిస్తోంది. అయితే, ఇదంతా అమెరికా గేమ్ అని.. రష్యా నుంచి నేరుగా కొనలేక.. భారత్ కొనేందుకు సహకరించి.. ఆ తర్వాత మన నుంచి శుద్ధి చేసిన ఆయిల్ ను అమెరికా కొంటోందని.. పరోక్షంగా అగ్రరాజ్యమూ లాభపడుతోందనే వాదనా వినిపిస్తోంది.

Advertisement

ఇదంతా సరేగానీ.. చమురు అంత చీప్ గా వస్తున్నప్పుడు.. ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎందుకు తగ్గట్లేదు? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు సగటు భారతీయుడు.

Related News

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

Big Stories

Advertisement
×