E-Paper
Advertisement

RevanthReddy: మళ్లీ కేటీఆర్‌కు, రకుల్‌ప్రీత్‌కు లింకు పెట్టిన రేవంత్.. ఈడీకి కంప్లైంట్..

RevanthReddy: మళ్లీ కేటీఆర్‌కు, రకుల్‌ప్రీత్‌కు లింకు పెట్టిన రేవంత్.. ఈడీకి కంప్లైంట్..
Advertisement

RevanthReddy : TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడినప్పటి నుంచి కాంగ్రెస్ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తోంది. ప్రభుత్వం వైఖరిని ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేయాలని టీపీసీసీ సంకల్పించింది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ పై దర్యాప్తు చేయాలని కోరారు. శనివారం ఏసీబీకి, సీబీఐకి రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు కేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

పేపర్ లీక్ పై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడొద్దని కోరారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు . కేసీఆర్, కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు.పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement

పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు. గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని విమర్శించారు. పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మిని చేర్చాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పరువున్నోళ్లు పరువు నష్టం దావా వేయాలన్నారు. కేటీఆర్ కు చీము నెత్తురుంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ లేఖ రాయాలన్నారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించాడని ప్రశ్నించారు. వంద కోట్లిస్తే కేటీఆర్ ను బూతులు తిట్టొచ్చా? అని అన్నారు. కేటీఆర్ ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్టా? సమంత సిరీస్ కు సంతకం పెట్టినట్టా అగ్రిమెంట్ చేసుకోవడానికి అని ప్రశ్నించారు.

Advertisement

అసలు కేటీఆర్ కు ఎగ్జామ్ రాసినవారి డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కటాఫ్ మార్కులు ఎంతో కేటీఆర్ కు ఎలా తెలుసన్నారు . 415 మంది జగిత్యాల నుంచి గ్రూప్- 1 పరీక్ష రాశారని కేటీఆర్ ఎలా చెప్పారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×