BigTV English

Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి

Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి

Revanthreddy : ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సీబీఐ అందరినీ ఢిల్లీకి పిలించిందని.. కవిత విచారణకు మాత్రం ఆపవ్షన్లు, అనుమతి కోరుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు.


నిజంగా కేసీఆర్‌ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములపై విచారణ చేపట్టాలని రేవంత రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల సంఘానికి తాను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఢిల్లీలో ఐదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అన్నారు. డిసెంబర్ 6లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెల్లకుండా పోతుందని అన్నారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని రేవంత రెడ్డి అన్నారు. ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×