Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి భేటీ అయ్యారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దుబ్బాక తరహాలో ఫేక్ పార్టీ బీజేపీ మునుగోడులోనూ బరితెగించిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి ఖాయమన్న భయం ఉన్నవాళ్లే ఇలాంటి నీచనానికి దిగజారుతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.