E-Paper
Advertisement

Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ.. ఒకరు మృతి..

Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ.. ఒకరు మృతి..

Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ దారుణ ఘటన రేగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ సరిహద్దులో ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వ్యాన్ కరీంనగర్ నుంచి భూపాలపల్లి వెళ్తోంది.

ఈ క్రమంలో భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సును కార్గో వ్యాన్ ఢీ కొట్టింది. వ్యాన్ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. అర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను అంబులెన్స్ లో పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రేమ్ సాగర్.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×