BigTV English
Advertisement

Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ.. ఒకరు మృతి..

Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ.. ఒకరు మృతి..

Road Accident : ఆర్టీసీ బస్సు కార్గో వ్యాన్ ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ దారుణ ఘటన రేగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ సరిహద్దులో ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వ్యాన్ కరీంనగర్ నుంచి భూపాలపల్లి వెళ్తోంది.


ఈ క్రమంలో భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సును కార్గో వ్యాన్ ఢీ కొట్టింది. వ్యాన్ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. అర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను అంబులెన్స్ లో పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రేమ్ సాగర్.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags

Related News

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Big Stories

×