Hyderabad: హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. ఓ వైన్ షాపు ముందు రౌడీ షీటర్ని వేట కొడవళ్లలో కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ తతంగమంతా సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది? వెంటాడి మరీ హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్ సిటీలోని బండ్లగూడ ప్రాంతంలో రౌడీషీటర్ నయీమ్ను దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో సుప్రీమ్ వైన్స్ ముందు ఈ ఘటన జరిగింది. నయీమ్ ఎక్కడ ఉన్నాడు తెలుసుకున్న ప్రత్యర్థులు, కారులో వచ్చిన వేట కొడవళ్లను బయటకు తీసి వెంటాడడం మొదలుపెట్టారు. నాలుగు వైపులా రౌడీ షీటర్ని రౌండప్ చేశారు.
ఆ సమయంలో నయీమ్.. వైన్ షాపు పరిసరాల్లోకి వెళ్లినా దుండగులు వదల్లేదు. ఆ వైన్స్లో నరికి నరికి చంపేశారు. వేటకొడవళ్లుతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. మృతుడు నయీమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందున్న పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు.
ALSO READ: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?
కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కారులో వచ్చినట్లు నిందితులు, మళ్లీ అదే వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నగరంలోని ఏయే ప్రాంతాల మీదుగా వారు వచ్చారు? అనేదానిపై సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు.
నాగోల్లో రౌడీషీటర్ దారుణ హత్య!
హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడ సుప్రీమ్ వైన్స్ వద్ద ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్ను దుండగులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. కారులో వచ్చిన నిందితులు దాడి చేసిన అనంతరం పరారయ్యారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న నాగోల్… pic.twitter.com/f9wF4G9qEr
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2026