Dalit Humiliation: శుద్ధీకరణ పేరిట దళితులను అవమానించిన ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను మర్కుక్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మర్కుక్ మండలం వరదరాజ్పూర్లో దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్కుక్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
అయితే కేసు దర్యాప్తులో భాగంగా వరదరాజ్పూర్కు చెందిన ఏడుగురు నిందితులను విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసులు సోమవారం ఉదయం వారిని మర్కుక్కు తీసుకొచ్చారు. అనంతరం గజ్వేల్ మెజిస్ట్రేట్ ఎదుట నిందితులను పోలీసులు హాజరుపరిచారు.
Also read: BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!
అప్పల ప్రవీణ్, రెడ్డిమల్ల అమరేందర్, శ్రీపతి రాజు, ముచ్చపతి హిమవంత్, అంతాని ఐలయ్య, అర్కాల రాజు, అంతాని మల్లేష్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు గజ్వేల్ మెజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ విధించడంతో వారిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Also read: కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!