BigTV English

Farmers: మొన్న రుణమాఫీ.. ఇప్పుడు దసరా వేళ రైతులకు మరో భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Farmers: మొన్న రుణమాఫీ.. ఇప్పుడు దసరా వేళ రైతులకు మరో భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Minister Uttam Kumar Reddy Comments: దసరా వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో భారీ శుభవార్త చెప్పింది. ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ధాన్యం కొనుగోలుపై సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన ఈ సమీక్షలో 2024-25 వానా కాలం మార్కెటింగ్ సీజన్ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.


Also Read: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఖరీఫ్ సీజన్ లో 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట రైతులు సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు గోదాములను ఏర్పాటు చేయనున్నాం. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. అడ్డుపడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ఫైర్

Tags

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×