E-Paper
Advertisement

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?
Advertisement

Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మళ్లీ దర్యాప్తును కొనసాగించనున్నది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లను రేపటి నుంచి రానున్న శనివారం వరకు ఒక్కొక్కరుగా విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఈఎన్సీలను, ఉన్నతాధికారులను కమిషన్ ప్రశ్నించనున్నది. వారిని విచారించనున్న నేపథ్యంలో ఇటు నీటి పారుదల శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అన్ని నివేదికలను ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. అడ్డుపడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ఫైర్

Advertisement

ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్ మెంట్ రిజిస్టర్, ఎంబుక్ లను కూడా తీసుకురావాలంటూ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో కమిషన్ పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ విచారణ సందర్భంగా కమిషన్ ను తప్పుదోవ పట్టించినా, నేరపూరితంగా వ్యవహరించినా, వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా వారికి భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వొద్దంటూ ప్రభుత్వానికి సిఫారాసు చేసే విషయమై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నది. ఇటు విజిలెన్స్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తుది నివేదిక ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది. మరో విషయమేమంటే.. కాళేశ్వరం నివేదిక ఆధారంగా కాగ్ అధికారుల నుంచి కూడా తాము వివరాలను కోరనున్నట్లు పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నది.

Also Read: హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ‘నువ్వు ట్రై చేయవా?’

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×