E-Paper
Advertisement

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మళ్లీ దర్యాప్తును కొనసాగించనున్నది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లను రేపటి నుంచి రానున్న శనివారం వరకు ఒక్కొక్కరుగా విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఈఎన్సీలను, ఉన్నతాధికారులను కమిషన్ ప్రశ్నించనున్నది. వారిని విచారించనున్న నేపథ్యంలో ఇటు నీటి పారుదల శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అన్ని నివేదికలను ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. అడ్డుపడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ఫైర్

ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్ మెంట్ రిజిస్టర్, ఎంబుక్ లను కూడా తీసుకురావాలంటూ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో కమిషన్ పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ విచారణ సందర్భంగా కమిషన్ ను తప్పుదోవ పట్టించినా, నేరపూరితంగా వ్యవహరించినా, వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా వారికి భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వొద్దంటూ ప్రభుత్వానికి సిఫారాసు చేసే విషయమై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నది. ఇటు విజిలెన్స్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తుది నివేదిక ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది. మరో విషయమేమంటే.. కాళేశ్వరం నివేదిక ఆధారంగా కాగ్ అధికారుల నుంచి కూడా తాము వివరాలను కోరనున్నట్లు పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నది.

Also Read: హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ‘నువ్వు ట్రై చేయవా?’

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×