Several IPS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
- శాంతి భద్రతల అదనపు డీజీపీగా – మహేశ్ భగవత్
- హోంగార్డుల, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా – స్వాతి లక్రా
- గ్రేహౌండ్స్ ఏడీజీగా – స్టీఫెన్ రవీంద్ర
- పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా – విజయ్ కుమార్ (పోలీస్ సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు)
- టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా – సంజయ్ కుమార్
- రాచకొండ పోలీస్ కమిషనర్ గా – సుధీర్ బాబు
- ఏసీబీ డైరెక్టర్ గా – తరుణ్ జోషి
- మల్టీజోన్ -1 ఐజీగా – ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
- మల్టీజోన్ -2 ఐజీగా – వి. సత్యనారాయణ
- రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా – కె. రమేశ్ నాయుడు
- మెదక్ ఎస్పీగా – ఉదయ్ కుమార్ రెడ్డి
- వనపర్తి ఎస్పీగా – ఆర్. గిరిధర్
- హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా – జి. బాలస్వామి
- హైదరాబాద్ సౌత్, వెస్ట్ జోన్ డీసీపీగా – చంద్రమోహన్
- సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీగా – రక్షితమూర్తి నియామకం
Share