E-Paper
Advertisement

Group-4 Exam : ఫోన్ తో పరీక్ష రాస్తూ.. దొరికిపోయాడు ఇలా..!

Group-4 Exam :  ఫోన్ తో పరీక్ష రాస్తూ.. దొరికిపోయాడు ఇలా..!
Advertisement

Group-4 Exam : తెలంగాణలో మొన్నటి వరకు TSPSC పేపర్ లీకేజీలు కలకలం రేపాయి. అప్పటి నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సహా ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. తప్పిదాలకు పాల్పడితే చర్యలు తప్పని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే తాజాగా నిర్వహించిన గ్రూప్‌ -4 పరీక్షలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని సక్సెస్‌ కళాశాలలో పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఆ అభ్యర్థిని పట్టుకున్నారు. ఇన్విజిలేటర్‌ ఆ అభ్యర్థి నుంచి ఫోన్‌ తీసుకుని సీజ్‌ చేశారు.

మాల్‌ ప్రాక్టీస్‌ కింద సదరు అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఉదయం సెషన్‌లో గ్రూప్-4 పేపర్-1 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా 8,180 ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేశారు.శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహిస్తున్నారు.

Advertisement

కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు రాలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు పరీక్ష రాయకుండానే నిరాశతో వెనుదిరిగారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×