E-Paper
Advertisement

Raghunandan Rao : బీజేపీకి గుడ్ బై..? BRSలోకి రఘునందన్‌రావు?

Raghunandan Rao : బీజేపీకి గుడ్ బై..? BRSలోకి రఘునందన్‌రావు?
Advertisement

Raghunandan Rao: తెలంగాణలో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పార్టీకి గుడ్ చెబుతారని తెలుస్తోంది. పార్టీలో పరిణామాలపై కొద్దిరోజులుగా రఘునందన్ అసహనంగా ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని అలకబూనారు. ఇదే విషయంపై ఇటీవల తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కమలం పార్టీ వరుస షాకులు తగులుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ డీలా పడింది. పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలు వెనకడుగువేశారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నా కాషాయ కండువాలు కప్పుకునేందుకు ఇతర పార్టీ నేతలెవరూ ముందుకురావడంలేదు.

Advertisement

మరోవైపు బీజేపీలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఆ బాధ్యతలు కేంద్రమమంత్రి కిషన్ రెడ్డికి ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అటు పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొద్దిరోజుల క్రితం అనుచరులతో మంతనాలు జరిపారు. ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని బలంగా వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే దారిలో ఉన్నారని అంటున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. అక్కడ ఓటమి ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. చేరికల సంగతి అలా ఉంచితే పార్టీలో కీలక నేతలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతుండటం కాషాయ పార్టీలో కలవరం రేపుతోంది. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూడాలి మరి.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×