BigTV English

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రాబోతున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే, ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.


జస్టిస్ అలోక్ అరదే మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్ర ఆమోదం లభించగానే జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారు. 2013లో జమ్మూకాశ్మీర్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను మణిపూర్‌ హైకోర్టు ప్రధానమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు చేసింది.


Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×