E-Paper
Advertisement

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రాబోతున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే, ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

జస్టిస్ అలోక్ అరదే మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్ర ఆమోదం లభించగానే జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారు. 2013లో జమ్మూకాశ్మీర్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను మణిపూర్‌ హైకోర్టు ప్రధానమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు చేసింది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×