BigTV English

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రాబోతున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే, ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.


జస్టిస్ అలోక్ అరదే మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్ర ఆమోదం లభించగానే జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు.

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారు. 2013లో జమ్మూకాశ్మీర్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను మణిపూర్‌ హైకోర్టు ప్రధానమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు చేసింది.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×