Teenmar Mallanna: మేడ్చల్ జిల్లీ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్లో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. జగద్గిరిగుట్టకు చెందిన సాయి ఈశ్వర్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు మల్లన్న వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు అతడిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన అపార్ట్మెంట్ చుట్టూ భారీగా బలగాలను మోహరించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం ప్రధానంగా హక్కుల సాధన ఉద్యమంలో పాల్గొంటున్న సాయి ఈశ్వర చారి, ప్రభుత్వాలు తమ హక్కులను కాదని నిరాశలో ఆత్మహత్య చేసుకున్నారని బీసీ జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న కార్యకర్తలు శుక్రవారం గాంధీ ఆసుపత్రి వద్ద గుమికూడి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వర చారికి న్యాయం చేయాలని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి తక్షణ ఆమోదం తెలపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సాయి ఈశ్వర మృతిపై ఆగ్రహంతో రగిలిపోయిన బీసీ సంఘాలు భారీగా చేరుకోవడంతో, పోలీసులు చర్యలు చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సహా కీలక నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: ఇద్దరు భార్యలతో నామినేషన్లు.. ఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త..
నిరసనలో పాల్గొన్న నాయకులు సాయి ఈశ్వర కుటుంబానికి.. కనీసం రూ.1 కోటి ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు. వారి కుటుంబం పూర్తిగా బీసీ ఉద్యమం కోసం పోరాడిన కుటుంబమని, వారికి అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు.