E-Paper
Advertisement

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వీస్తోందని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే.. మరికొందరు బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి తీసుకురావడనికే మోదీ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒక వేళ హంగ్ వస్తే.. బీజేపీ అధికారం చేజిక్కుంచుకుంటామని బీజేపీ నేతలు కొన్ని సందర్భాలు చెబుతున్నారు. అందుకు కారణం బీజేపీ ప్లానింగ్ అని తెలుస్తోంది.

బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీచేసినా ముందుగా ఫోకస్ చేసేది కచ్చితంగా గెలుస్తామని నమ్మకమున్న సీట్లపైనే. మిగతా సీట్లలో బలహీనంగా ఉంటే వాటిని పట్టించుకోదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే ప్లానింగ్‌తో ముందుకువెళుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెలవకపోతే.. ప్లాన్ బి అమలు పరుస్తారు. హంగ్ లాంటి పరిస్థితులు తీసుకువచ్చి కింగ్ మేకర్ లేదా బేరసారాలు జరిపి ఏకంగా కింగ్ కావచ్చు. అందుకోసమే బీజేపీ అన్ని సీట్లు గెలవడం కంటే 23 స్థానాలు గెలుస్తే చాలు. ఆ సీట్లు సాధించి మరో ప్రధాన పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్‌తో బేరసారలు జరిపి అధికారం సాధించే అవకాశాలున్నాయి.

బీజేపీ ఒకవేళ కనీసం 15 సీట్లు సాధించినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దూరమవుతాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో కూడా దీనికోసమే బీజేపీ అనుబంధ పార్టీలైన ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, వీహెచ్‌పీ, యువమోర్చా నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×