E-Paper
Advertisement

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!
Advertisement

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వీస్తోందని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే.. మరికొందరు బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి తీసుకురావడనికే మోదీ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒక వేళ హంగ్ వస్తే.. బీజేపీ అధికారం చేజిక్కుంచుకుంటామని బీజేపీ నేతలు కొన్ని సందర్భాలు చెబుతున్నారు. అందుకు కారణం బీజేపీ ప్లానింగ్ అని తెలుస్తోంది.

Advertisement

బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీచేసినా ముందుగా ఫోకస్ చేసేది కచ్చితంగా గెలుస్తామని నమ్మకమున్న సీట్లపైనే. మిగతా సీట్లలో బలహీనంగా ఉంటే వాటిని పట్టించుకోదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే ప్లానింగ్‌తో ముందుకువెళుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెలవకపోతే.. ప్లాన్ బి అమలు పరుస్తారు. హంగ్ లాంటి పరిస్థితులు తీసుకువచ్చి కింగ్ మేకర్ లేదా బేరసారాలు జరిపి ఏకంగా కింగ్ కావచ్చు. అందుకోసమే బీజేపీ అన్ని సీట్లు గెలవడం కంటే 23 స్థానాలు గెలుస్తే చాలు. ఆ సీట్లు సాధించి మరో ప్రధాన పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్‌తో బేరసారలు జరిపి అధికారం సాధించే అవకాశాలున్నాయి.

బీజేపీ ఒకవేళ కనీసం 15 సీట్లు సాధించినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దూరమవుతాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో కూడా దీనికోసమే బీజేపీ అనుబంధ పార్టీలైన ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, వీహెచ్‌పీ, యువమోర్చా నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×