E-Paper
Advertisement

Telangana:అంగన్ వాడీలలో ఇక ప్లే స్కూల్స్..సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన

Telangana:అంగన్ వాడీలలో ఇక ప్లే స్కూల్స్..సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన
Advertisement

Telangana govt start Anganwadi Play schools(TS today news):

నిధుల కొరతతో నీరసించిన అంగన్ వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో అంగన్ వాడీ ఆధ్వర్యంలో కాన్వెంట్ల తరహాలో ప్లే స్కూల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉంది. దీనితో తల్లిదండ్రులు తమ పిల్లలను డబ్బులు ఎక్కువైనా ఫరవాలేదు..ప్రైవేటు స్కూల్స్ లో తమ పిల్లలను చేరుస్తున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న ఫీజులు కట్టుకోలేక..అటు ప్రభుత్వ పాఠశాలలకు పంపలేక సతమతమవుతూ వస్తున్నారు.

Advertisement

రేవంత్ విప్లవాత్మక నిర్ణయాలు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినాక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. నిధుల కొరత ఉన్నా..రాష్ట్రంలో విద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పి నూతన తరహా విద్యా వ్యవస్థ రావాలని కోరుకుంటున్నారు. అందుకు ప్రభుత్వ అధికారులను సంసిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని నియోజకవర్గాలలో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందుకు అధికారులు కూడా సీఎం సూచనకు మద్దతు తెలిపారు.
అంగన్ వాడీ కార్యాలయాలలో ఇక నుంచి ప్లే స్కూల్స్ తరహాలో మూడవ తరగతి దాకా విద్యార్థులకు విద్యనందించాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను సూచించారు. అయితే అదనపు ఖర్చవుతుందని..ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకోవాల్సి వస్తుందని అధికారులు సూచించడంతో నిధుల గురించి ఆలోచించవద్దని చిన్నారుల సంరక్షణ కేంద్రాలుగా ఉన్న అంగన్ వాడీలు ఇకపై ప్లే స్కూల్స్ గా రూపాంతరం చెందాలని సీఎం గట్టి నిర్ణయమే తీసుకున్నారు.

Advertisement

సెమీ రెసిడెన్సియల్ పాఠశాలలు

ఇక ప్లే స్కూల్ తర్వాత 4వ తరగతి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేరడానికి ఈ ప్లే స్కూల్ లో చదివిన విద్యార్థులకే అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయే సెమీ రెసిడెన్సియల్ పాఠశాలలకు రవాణా సదుపాయాలు కల్పించాలని..విద్యార్థులకు ఉచితంగానే రవాణా సదుపాయం కల్పించాలని అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై సంబంధిత అధికారులను నివేదిక అందించాల్సిందిగా కోరారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేయబోయే సెమీ రెసిడెన్సియల్ పాఠశాలలలో మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ తదితర పాఠశాలలన్నీ కలిపి ఒకే చోట ఉండేలా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.

ముందుగా పైలట్ ప్రాజెక్టులు

ప్లే స్కూల్స్ ఎలా నడపాలో విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. వారికి సంబంధించిన పాఠ్యాంశాలు, ఏ తరహా శిక్షణ ఎలా ఇవ్వాలి, పాఠశాల సమయం తదితర అంశాలపై సీనియర్ విద్యావేత్తల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలలో ఆరంభించి దానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్ వాడీల కేంద్రాలలో ప్లే స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, ఖమ్మం పరిధిలోని మధిర నియోజకవర్గాలలో ఈ పైలెట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×