BigTV English

CM Revanth Congrats: 31,382 మంది అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Congrats: 31,382 మంది అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy tweet on group -1 prelims results: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మందికి ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు. అక్టోబర్ 21నుంచి 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలోనూ విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు.


ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరుతారంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Also Read: హీరోకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం


అయితే, టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారం ఉదయం టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం విధితమే. తుది కీతోపాటు రిజల్ట్స్ ను కూడా టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×