BigTV English
Advertisement

Deputy Cm Tweet: హీరోకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం

Deputy Cm Tweet: హీరోకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti Vikramarka Thanks To Sai Dharam Tej In Twitter: ఈ మధ్యకాలంలో ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం కామన్ అయిపోయింది అందరికి.. ఎందుకంటే తమ ఫొటోలకు, వీడియోలకు లైక్స్, కామెంట్స్ వస్తాయని, మరికొందరు ట్రెండింగ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు అవే కొంపముంచుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల బారినపడి చాలామంది వారి భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు వారితో పాటుగా వారి పిల్లల భవిష్యత్‌ని నాశనం చేస్తున్నారు. తమ పిల్లల ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రపంచమంతా క్రూరమైనదిగా, ప్రమాదకరంగా మారిపోయిందని తెలిపారు. అందుకే పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే ముందు తల్లిదండ్రులు కొంత వివేకంతో ఆలోచించాలని కోరాడు. సోషల్ మీడియాలో కొందరు మృగాలు ఉంటాయని, వారిని కట్టడి చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. వినోదం పేరిట పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని… ఇది భయంకరం, అసహ్యకరం కంటే కూడా ఎక్కువని సాయితేజ్ పేర్కొన్నారు. ఇప్పుడు పిల్లల భద్రత అత్యంత ముఖ్యమని, సోషల్ మీడియాలో ఇలాంటి వికృత ధోరణులను అరికట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఓ చిన్నారి బాలికకు సంబంధించిన వీడియోను కూడా సాయితేజ్ పంచుకున్నారు. ఆ వీడియోపై కొందరు వ్యక్తులు ఆన్ లైన్ లో చాటింగ్ చేసిన విధానాన్ని తేజ్ ప్రస్తావించారు. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.

Also Read: ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్ వైరల్‌


ఎంతో కీలక సమస్యను ఎత్తిచూపినందుకు సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారుల భద్రత ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమేనని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో చిన్నారులపై వికృత ధోరణులు, వేధింపులను అరికట్టేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పిల్లలకు మరింత మెరుగైన ఆన్ లైన్ వాతావరణాన్ని అందించేందుకు మనం కలిసి పనిచేద్దామని భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ డిప్యూటీ సీఎం పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ గుడ్ మెసేజ్ ఇచ్చారండీ అంటూ డిప్యూటీ సీఎంని హీరోని కొనియాడుతున్నారు.

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×