E-Paper
Advertisement

Congress: రేవంత్ వర్సెస్ సీనియర్స్.. ఢిల్లీలో కాంగ్-రేస్..

Congress: రేవంత్ వర్సెస్ సీనియర్స్.. ఢిల్లీలో కాంగ్-రేస్..
Advertisement

Congress: కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించనవసరం లేదు.. వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు. రాజకీయాల్లో పాపులర్ కొటేషన్ ఇది. అట్లుంటది మరి కాంగ్రెస్ తోని. ఎప్పుడూ ఆధిపత్య పోరే. ఎల్లప్పుడూ అంతర్గత కుమ్ములాటలే. హస్తం చేతిరాతను ఎవరూ మార్చలేరని అంటారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చాకైనా కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని.. క్రమశిక్షణ పెరుగుతుందని ఆశిస్తే.. అడియాసే అయిందంటున్నారు. రేవంత్ రెడ్డి మీదనే కుప్పలు తెప్పలు కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు.

లేటెస్ట్ గా కాంగ్రెస్ కుటుంబ వ్యవహారం హస్తినకు చేరింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. పార్టీ కమిటీలన్నిటినీ ప్రక్షాలన చేయాలని భావిస్తున్నారు. పీసీసీ, డీసీసీ కమిటీల్లో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు.. జాతీయ అధ్యక్షుడు ఖర్గే ముందు కోరికల చిట్టా ఉంచారట రేవంత్ రెడ్డి.

Advertisement

విషయం తెలిసి సీనియర్లు అలర్ట్ అయ్యారు. వెంటనే వాళ్లు కూడా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ పదవులన్నిటినీ రేవంత్ రెడ్డి తన వర్గీయులతో నింపేస్తారని జాగ్రత్త పడుతున్నారు. ఖర్గే ఇంటి ముందు క్యూ కట్టి.. ఒక్కో నేత ఒక్కో తరహా విన్నపాలు చేస్తున్నారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ.. ఇలా సీనియర్లంతా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. అంతా ఖర్గేను కలిశారు. తమదైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అందులో ఎలానూ రేవంత్ రెడ్డి గురించి కంప్లైంట్స్ ఉంటాయంటున్నారు.

Advertisement

తన పదవి ఊస్ట్ అవకుండా.. తమ వారి పదవులు పదిలం చేసుకునేలా.. ఖర్గేకు మొరపెట్టుకున్నారట సీనియర్లు. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా మార్చుతారని టాక్. అందుకే కాబోలు జగ్గారెడ్డి ఇటీవల తెగ ఫైర్ మీదున్నారు. కాంగ్రెస్ లో ఇలాంటివి కామనే. ఎవరెన్ని ఫిర్యాదులు, డిమాండ్లు చేసినా.. అంతిమంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాబితానే కన్ఫామ్ అవుతుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయినా తమ కోసం, తమవారి కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్లు.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×