E-Paper
Advertisement

Congress leaders dharna: ఈడీ ఆఫీసు.. కాంగ్రెస్ నేతల ధర్నా, అదానీ వ్యవహారం తేల్చాలంటూ..

Congress leaders dharna: ఈడీ ఆఫీసు.. కాంగ్రెస్ నేతల ధర్నా, అదానీ వ్యవహారం తేల్చాలంటూ..
Advertisement

Congress leaders dharna: బిజినెస్‌మేన్ అదానీ వ్యవహారంపై తేల్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ధర్నాకు దిగారు. అదానీ కుంభకోణంపై కచ్చితంగా విచారణ జరపాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు.

హిండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ సంస్థలపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ, మోదీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అదానీ మెగా కుంభకోణంపై విచారణ చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈడీ కార్యాలయాల ముందు నేతలు ఆందోళనకు దిగారు.

Advertisement

ఇందులోభాగంగా హైదరాబాద్‌లో గన్ పార్క్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు. అక్కడి నుంచి నేరుగా ఈడీ ఆఫీసుకు వరకు ర్యాలీ చేపట్టారు. సెబీ చీఫ్ మాదభీ బచ్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబట్టి, మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ALSO READ: తెలంగాణలో భిన్న వాతావరణం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Advertisement

దేశ సంపదను అదానీ కొల్లగొడుతున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అదానీ ఆస్తులపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా రాహుల్ డిమాండ్ చేసిన విషయాన్ని వివరించారు.

పనిలోపనిగా బీఆర్ఎస్‌పైనా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మంత్రులు. ఆ పార్టీకి దేశం మీద ప్రేమ ఉంటే ధర్నా చేయాల్సి రుణమాఫీపై కాదని, అదానీపై చేయాలన్నారు.  పదేళ్ల బీజేపీ పాలనలో ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని ప్రజలు ఊహించలేదన్నారు సంపత్‌కుమార్.

 

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×