E-Paper
Advertisement

Kaleshwaram Project : కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ వినూత్న ప్రచారం.. సీఎం ఫొటోతో లక్షరూపాయలు

Kaleshwaram Project : కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ వినూత్న ప్రచారం.. సీఎం ఫొటోతో లక్షరూపాయలు
Advertisement

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించింది. ఈ ఏటీఎంలను హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఆలోచన చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇటీవల పిల్లర్లు కుంగిపోయాయి. లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. నిర్మాణంలో లోపం వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని రిటైర్డు ఇంజనీర్లు, నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుకు పెద్దగా నష్టం జరగలేదని బుకాయిస్తోంది. వాస్తవ నివేదికను బయటపెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలను దోచేశారని…ఆ స్కాంను గుర్తు చేసేందుకు ఏటీఎం నుండి లక్ష రూపాయల నోటు బయటికి రావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏటీఎంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు ఫొటోలు ముద్రించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంలు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×