E-Paper
Advertisement

Passport Centre: దేశంలో తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?

Passport Centre: దేశంలో తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?
Advertisement

Passport Centre: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఓ మెట్రో స్టేషన్ లో ఆధునిక పాస్ పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక రోజుకు వేల స్లాట్లతో సేవలు అందుబాటులోకి రానున్నాయి. భాగ్య నగరంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్ పోర్ట్ కార్యాలయాన్ని మంతరి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్ లు ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటి వరకు అమీర్ పేట ఆదిత్య ట్రేడ్ సెంటర్ లో సేవలు అందించిన పాస్ పోర్ట్ కేంద్రాన్ని ప్రస్తుతం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కు తరలించి ఆధునీకరించి అందుబాటులోకి తెచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. టోలి చౌకీ, షేక్ పేట వద్ద ఉన్న కేంద్రాన్ని రాయదుర్గం ఓల్డ్ ముంబై రోడ్డు సిరి బిల్డింగులోకి మార్చామని చెప్పారు. దేశంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయం ఐదో స్థానంలో ఉందని అన్నారు. ఎంజీబీఎస్, రాయదుర్గం, నిజామాబాద్, కరీనంగర్ ప్రాంతాల్లో రాష్ట్రంలో పాస్ పోర్ట్ సెంటర్లు ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒక రోజుకి 4500 పాస్ పోర్ట్ లు ఇచ్చే కెపాసిటీ ఉందని.. దీన్ని 5000 స్లాట్లకు పెంచుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

ఎంజీబీఎస్ సెంటర్ లో రోజుకు 700 స్లాట్స్ ఉన్నాయని.. దీన్ని 1200 స్టాట్స్ కు పెంచాలని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ ప్రారంభించిన పాస్ పోర్ట్ సెంటరలో 250 స్టాట్స్ ఉన్నాయిన.. దీనిని 500 పెంచుకోవాలని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో 5000 స్లాట్స్ దాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలని అన్నారు.

ALSO READ: Weather News: కాసేపట్లో ఈ ఏరియాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్త.. పిడుగులు పడే ఛాన్స్

Advertisement

గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికుల మాదిరి విదేశాలకు వెళ్లేని.. అదే  ఇప్పుడు విద్యా, ఉపాధి అవకాశాలు నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే టూరిజం కోసం విదేశాలకు వెళ్తున్నారని అన్నారు. భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి ప్రతి ఒక్కరూ పాస్ పోర్ట్ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ALSO READ: Rajendranagar: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్ బాడీ లభ్యం

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×