E-Paper
Advertisement

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో విజ్ఞప్తి

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో విజ్ఞప్తి

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ పథకం యథావిధిగా కొనసాగాలని.. ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లు వైద్య సేవలను నిలిపివేయాలన్న నిర్ణయం.. పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

ఉచిత వైద్య పరిమితి పెంపు

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద లభించే ఉచిత వైద్య పరిమితిని.. ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచినట్లు సీఈవో గుర్తుచేశారు. దీని వల్ల పేద కుటుంబాలకు మరింత భరోసా కలిగిందని, అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. వైద్యం అందించే అవకాశం కలిగిందని తెలిపారు.

భారీ స్థాయిలో చెల్లింపులు

గత 21 నెలల్లో ప్రభుత్వం ₹1,779 కోట్లు.. ప్రైవేట్ హాస్పిటళ్లకు చెల్లించిందని ఉదయ్ కుమార్ వెల్లడించారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు ₹57 కోట్లు మాత్రమే చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సగటున ₹75 కోట్లు చెల్లించామని అన్నారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ప్రతి నెలా ₹95 కోట్లు చెల్లిస్తోందని, హాస్పిటల్ యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నెలకు ₹100 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

ప్యాకేజీ చార్జీల పెంపు

దశాబ్ద కాలంగా ప్రైవేట్ హాస్పిటళ్లు ప్యాకేజీ చార్జీల పెంపు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22% పెంచినట్లు సీఈవో తెలిపారు. అదనంగా, 163 కొత్త రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేషెంట్లకు ప్రభుత్వం ఊరట కలిగించిందని చెప్పారు. ఈ రెండు నిర్ణయాలతోనే ప్రభుత్వం అదనంగా ₹487.29 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు.

ప్రభుత్వం సానుకూల వైఖరి

హాస్పిటల్ యాజమాన్యాల నుండి వచ్చిన ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఈవో ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, హాస్పిటళ్లు కూడా అదే దిశగా సహకరించాలని కోరారు.

పేషెంట్ల ప్రయోజనం ముఖ్యమని విజ్ఞప్తి

ఆరోగ్యశ్రీ పథకం కింద లక్షలాది మంది పేద రోగులు.. ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సేవల నిలిపివేత అనేది పేద ప్రజల ప్రాణాలకు ముప్పు అని సీఈవో హెచ్చరించారు. అందువల్ల, తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని.. ఆయన హాస్పిటళ్ల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: డెహ్రాడూన్ వరద ప్రవాహంలో.. 10 మంది గల్లంతు

ప్రభుత్వం ఇప్పటికే చెల్లింపులు పెంచడం, ప్యాకేజీలను సవరించడం, కొత్త వైద్య సేవలను చేర్చడం వంటి చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ, పేషెంట్ల ప్రయోజనమే ముఖ్యమని సీఈవో స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం నిరంతరంగా కొనసాగడం ద్వారా.. లక్షలాది పేద కుటుంబాలు ఊరట పొందుతాయని, హాస్పిటళ్లు సేవల నిలిపివేతను విరమించి సమాజానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×