E-Paper
Advertisement

Loans to Unemployed Youth: శుభవార్త.. యువతకు రూ.3 లక్షల రుణ సాయం, దరఖాస్తులకు ఆఖరి తేదీ ఇదే

Loans to Unemployed Youth: శుభవార్త.. యువతకు రూ.3 లక్షల రుణ సాయం, దరఖాస్తులకు ఆఖరి తేదీ ఇదే
Advertisement

Telangana Govt:  తెలంగాణ ప్రభుత్వం యువతకు శుభవార్త చెప్పింది. కేవలం ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం’ స్కీమ్ ను అమలు చేయనుంది. ఈ స్కీమ్‌లో భాగంగా యువతకు రుణాలు మంజూరు చేయనుంది.

తెలంగాణ యువతకు కొత్త స్కీమ్

Advertisement

యువత కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకోసం రాజీవ్‌ యువ వికాసాన్ని పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.ఈ ప్రక్రియ మార్చి 17వ నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్పొరేషన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చాయి. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది.

Advertisement

ఎస్టీ, ఎస్సీ, బీసీ యువతకు

ఈ పథకానికి అర్హతలు, ఎంపిక వివరాలు https://tgobmms.cgg.gov.in/ పోర్టల్‌లో పొందుపరిచింది. ఈ విషయాన్ని బీసీ కార్పొరేషన్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు తెలుసుకోవాల్సినవారు సంక్షేమశాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను సంప్రదించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరిజనులు ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ పేర్కొంది.

ALSO READ: మళ్లీ నేనే ముఖ్యమంత్రి

రుణాల్లో రాయితీలు కూడా

యువత దరఖాస్తు చేసిన వాటిని ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు పరిశీలన కొనసాగు తుంది. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2న) ఈ పథకానికి సంబంధించి రుణాల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేయనుంది. రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌లో మూడు కేటగిరీ ఉంటాయి. 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది ప్రభుత్వం.

కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఉంటుంది. కేవలం 20 శాతం లబ్ధిదారు భరించడం లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు కేటాయిస్తారు. కేటగిరీ 2 కింద రూ.లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో 70 శాతం వరకు రాయితీ ఉంటుంది. కేటగిరీ-3 కింద రూ.3 లక్షల లోపు రుణాలు ఇస్తారు. కాకపోతే 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×