E-Paper
Advertisement

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

చిన్న చిన్న వంట చిట్కాలు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అంతేకాదు అదే ఆహారాన్ని ఆరోగ్యంగా మార్చేందుకు కూడా ఉపయోగపడతాయి. చికెన్, చేపలు, మటన్ వంటివి వండినప్పుడు ముందుగానే వాటిని ఒక గిన్నెలో వేసి పసుపు, నిమ్మకాయ రసం, పెరుగు వంటివి వేసి మ్యారినేట్ చేస్తారు. నిమ్మకాయ లేదా పెరుగు ఈ రెండింటినీ మ్యారినేట్ చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

ఇలా శుభ్రం చేయండి
చికెన్ లేదా మటన్ వంటి మాంసాన్ని శుభ్రం చేసేందుకు వైట్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ముందుగా వాటిని వెనిగర్ నీటిలో ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టాలి. ఇందుకోసం ఒక పాత్రలో నీరు వేసి అందులో మాంసం మునిగేటట్టు వేయాలి. తర్వాత ఒక చిన్న కప్పుతో వైట్ వెనిగర్ ను వేయాలి. ఇలా బయట వెనిగర్ వేసిన నీటిలో మాంసాన్ని శుభ్రం చేయడం వల్ల దానిపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. మాంసాహారంపైనున్న కలుషితాలు పోతాయి. ఈ చిట్కా కూడా చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ మరింత టేస్ట్ గా వచ్చేందుకు ఉపయోగపడుతుంది.

మ్యారినేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది?
చికెన్ మటన్ చేపలు వంటి వాటిని నిమ్మకాయ, పెరుగులో మొదటగా మ్యారినేట్ చేస్తారు. కొంతమంది నిమ్మకాయ మాత్రమే ఇస్తారు. మరికొందరు వైట్ వెనిగర్ వేస్తారు. ఇంకొందరు పెరుగు కూడా వేస్తారు. సాధారణంగా తెలుగు ఇళ్లల్లో వాడేది మాత్రం నిమ్మకాయ రసం లేదా పెరుగు. ఇవి ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి. పులుపు రుచి కూడా అధికం. వీటిని మాంసానికి పట్టించడం వల్ల పులుపు రుచి, ఆమ్ల లక్షణాల వల్ల మాంసంలోని ప్రోటీన్లు విచ్ఛిన్నం చేస్తాయి. దీని వల్ల చికెన్, మటన్ వంటివి వండుతున్నప్పుడు మసాలాల రుచిని మరింత సులభంగా గ్రహిస్తాయి. అప్పుడు మాంసం మృదువుగా కూడా ఉడుకుతుంది. ప్రోటీన్లు అప్పటికే విచ్ఛిన్నమై ఉంటాయి కాబట్టి త్వరగా కూడా ఉడికిపోతుంది. జ్యూసీగా రుచిగా వస్తుంది.

వీటిలో ఎన్నో ఉపయోగాలు
చికెన్, మటన్ వంటి మాంసాలను వండడానికి ముందు మీరు మ్యారినేట్ చేయకపోతే మీరు వేసిన మసాలాలు ఆ ముక్కలకు త్వరగా పట్టవు. ఉప్పు కూడా సరిగా ముక్కలకు పట్టదు. దీనివల్ల కర్రీ రుచిగా అనిపించదు. కాబట్టి మాంసాహారాన్ని వండే ముందు కచ్చితంగా నిమ్మకాయ, పెరుగు లేదా వైట్ వెనిగర్ వేసి మ్యారినేట్ చేసేందుకు ప్రయత్నించండి. నిజానికి నిమ్మకాయ రసం, పెరుగు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి నో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో కూడా మన పొట్టకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రెండూ కూడా అన్ని విధాలా మేలే చేస్తాయి. కాబట్టి చికెన్, మటన్ వండే ముందు కచ్చితంగా నిమ్మరసం లేదా పెరుగు వేసి మ్యారినేట్ చేయండి. వీలైతే రెండూ వేయండి. దీనివల్ల కర్రీ కూడా మరింత టేస్టీగా వస్తుంది.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×