BigTV English
Advertisement

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Formula E Racing Scam: బీఆర్ఎస్ నేతలు కష్టాలు వెంటాడుతున్నాయి. గడిచిన పదేళ్లలో చేసిన అవకతవకలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. లేటెస్ట్‌గా హైదరాబాద్‌ లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది.


నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు ముట్టజెప్పారంటూ మున్సిపల్ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. దీంతో గత పాలకుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయ్యింది.

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది. ఆ తరహా రేస్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉందని, అందులో హైదరాబాద్ ఒకటని ఢంకా బజాయించింది.


ఈ రేసు వెసుక అసలు వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. లేటెస్ట్‌గా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించినట్లు మున్సిపల్ అధికారులు తేల్చారు. దీనిపై విచారణ జరపాలంటూ అధికారులు ఏసీబీకి లెటర్ రాయడంతో బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైంది.

ALSO READ: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ

గతేడాది హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఫార్ములా ఈ-రేస్ జరిగింది. ఈ రేస్ కోసం దాదాపు మూడు కిలోమీటర్ల మేరా ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. తొలి రేస్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులతో పట్టణాభివృద్ధి సంస్థ డీల్ కుదుర్చుకుంది.

ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను ఆ సంస్థకు చెల్లించింది. ఈ వ్యవహారమంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. గత డిసెంబర్‌లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఒప్పందంలోని అంశాలు పాటించకపోవడం వల్ల హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ- రేస్ నుంచి తప్పుకుంటున్నామని గత డిసెంబర్‌లో నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది జరగాల్సిన రేసు ఆగిపోయింది.

పద్దతి ప్రకారం.. హెచ్ఎండీఏ బోర్డు సభ్యులతోపాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత ఫార్ములా నిర్వహణ సంస్థకు నిధులు చెల్లించాలి. అలాంటిదేమీ జరక్కుండానే నేరుగా నిధులను ఆ సంస్థకు ఇచ్చేశారు.

విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అవేమీ పట్టించుకోలేదు అప్పటి అధికారులు. దీనిపై అప్పటి అధికారులకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ప్రక్రియ వేగంగా జరగాలనే ఉద్దేశంతో చెల్లింపులు జరిపామన్నది అధికారుల వెర్షన్.

ఈ వ్యవహారమంతా పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ శాఖకు మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఏసీబీ లేఖ రాయడంతో బీఆర్ఎస్ వెన్నులో వణుకు మొదలైంది. ప్రభుత్వం రేస్ స్కామ్ వ్యవహారాన్ని ఏసీబీకి ఇస్తుందా? లేదా సీఐడీకి ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×