Miyapur Incident: మియాపూర్లో నాలాలో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీంతో హైడ్రా, సిఎంసి కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లో వరద నీటి కాలువల ప్రమాదాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ చేపట్టాలని చెప్పింది.
మియాపూర్లో వృద్ధుడు డ్రెయిన్లో పడి గల్లంతైన ఘటనను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని పేర్కోంది. హైదరాబాద్లో ఉన్న ఓపెన్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్లపై మానవ హక్కల కమిషన్ ఆందోళన చేసింది. పట్టనంలో వీటిపై రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కమిషన్ తెలిపింది.
Also Read: కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!
ఈ ఘటనపై ఆగస్టు 25వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్కు మరియు సీఎంసీ కమిషనర్కు ఆదేశాలు మానవ హక్కుల కమీషన్ తెలిపింది. ప్రజల భద్రతపై ఇంత నిర్లక్ష్యాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించిందని పేర్కోంది.
Also Read: రాంచందర్ రావుకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!