E-Paper
Advertisement

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి
telangana youth died in america with brain stroke
telangana youth died in america with brain stroke

Telangana Youth Died in US(TS news updates): విదేశాల్లో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం సాధించాలని అతను కన్న కలలన్నీ ఆవిరయ్యాయి. తల్లిదండ్రులు కొడుకును ఉన్నత శిఖరాలపై చూడాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారి కలలు తీరకుండానే బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబళించింది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్దకొడుకు బండా రుత్విక్ రాజన్ (30) రెండేళ్ల క్రితం ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు.

Read More : ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..

అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తిచేసి పట్టా పొందాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న అతను.. స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి కిందపడ్డాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయాడని తెలిపారు. కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×