E-Paper
Advertisement

Amrit Bharat Stations: తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు.. నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని!

Amrit Bharat Stations: తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు.. నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని!
Advertisement
Amrit Bharat Railway Stations in india
Amrit Bharat Railway Stations in india

Amrit Bharat Railway Stations in Telugu States : పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను నిర్మించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అమృత్ భారత్ స్టేషన్ల రీ డెవలప్ మెంట్ లో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.843.54 కోట్ల వ్యయంతో ఆధునీకరించనున్న ఈ స్టేషన్లకు ప్రధాని నరేంద్రమోదీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు సోమవారం దేశవ్యాప్తంగా 500లకు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మరో 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు భూమిపూజ నిర్వహిస్తారు.

అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ స్కీమ్ లో భాగంగా.. రైల్వే ప్రయాణికులకు స్టేషన్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకే ఈ ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 72 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడలతో పాటు.. నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను కేంద్రం గుర్తించింది. వీటి అభివృద్ధికి రూ.270 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆయా స్టేషన్లలో పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు మరో 34 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది.

Advertisement

Read More: రాజ్యసభ ఎన్నికలు.. కర్ణాటకలో అలుముకున్న క్రాస్ ఓటింగ్ ఛాయలు..

ఏపీలో అనంతపురం, అనపర్తి, చీరాల, బాపట్ల, ఆదోని, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మంగళగిరి, మార్కాపురం, మంత్రాలయం, నడికుడి, నంద్యాల, నర్సారావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకోట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.610.30 కోట్లు ఖర్చు చేయనుంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×