E-Paper
Advertisement

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Bihar Road accident
Bihar Road accident

9 People died in Bihar Road Accident: బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ట్రక్కు, జీపు, మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న జీప్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది, రెండు వాహనాలు ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు.

“ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మందితో కూడిన జీపు.. మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జీప్‌పై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఢీకొన్నట్లు తెలుస్తోంది” అని మోహానియా డీఎస్పీ దిలీప్‌కుమార్ తెలిపారు.

కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Read More: Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

“కైమూర్‌లోని మోహానియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తన తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు” అని సీఎం కార్యాలయం ఆదివారం అర్థరాత్రి ప్రకటన విడుదల చేసింది.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×