E-Paper
Advertisement

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!
Advertisement

Bahar Biryani Cafe: దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రముఖ ‘బహార్ బిర్యానీ కేఫ్’పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్ రైడ్స్ నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ వెనుక ఎంతటి నిర్లక్ష్యం ఉందో ఈ తనిఖీల్లో తేలింది. హోటల్ కిచెన్‌లో నిల్వ ఉంచిన పదార్థాలను చూసి అధికారులే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సోదాల్లో సుమారు 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన పలు ఆహార నిల్వలను ఫుడ్ సేఫ్టీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ పాడైపోయిన మాంసాన్ని అధికారులు వెంటనే అక్కడికక్కడే పారవేయించారు. అనంతరం హోటల్లోని పలు ఆహార పదార్థాల నమూనాలను (శామిల్స్) సేకరించి, సమగ్ర విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించారు.

Advertisement

వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. కనీస పరిశుభ్రత పాటించని ఈ కేఫ్‌పై కఠిన చర్యలకు అధికారులు సిఫార్సు చేశారు. బహార్ బిర్యానీ కేఫ్ ఎఫ్‌ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు రిపోర్ట్ పంపారు. బయట తిండిపై ఆధారపడే సామాన్యుల భద్రతను పక్కనబెట్టిన యాజమాన్యం తీరుపై ప్రజలు మండిపడుతుండగా, ఈ హఠాత్ తనిఖీలతో స్థానిక రెస్టారెంట్ నిర్వాహకుల్లో తీవ్ర కలకలం రేగింది.

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

Tags

Related News

చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

Big Stories

Advertisement
×