Khammam Girl: ఖమ్మం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఓ ఇద్దరు మైనర్ యువకులు బాలికను వేదించారు. దీంతో యువకుల వేదింపులు భరించలేక నేడు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఖమ్మం నగరంలో కె.సి.ఆర్ టవర్స్లో బాలిక నివాసం ఉంటుంది. రోటరీనగర్లోని సూపర్మార్కెట్లో సెల్స్గర్ల్గా ఆ బాలిక పనిచేస్తుంది. అయితే అదే ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడు బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ వేదించేవాడు.
యువతి పవన్ ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆ తర్వాత బాలికను పంవన్ మరింత వేధింపులకు గురిచేసినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో పవన్ అతని స్నేహితుడు అమన్ సైతం బాలికను వేధించినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కోన్నారు. యుతిని లొంగదీసుకునే ప్రయత్నం యువకులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వారం రోజుల క్రితం బాలిక ఫొటోను సెల్ఫోన్లో ఎడిట్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also read: రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!
పవన్ అతని స్నేహితుడు అమన్ వేధింపులు తట్టకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 8న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఖమ్మంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్కు బాలికను తరలించారు. దీంతో చికిత్స పొందుతూ నేడు ఉదయం బాలిక మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు మైనర్ యువకులపై కేసు నమోదు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతితో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అమన్ కోసం ముమ్మర దర్యాప్తు చేపట్టారు. వరంగల్ నుండీ ఖమ్మంకు బాలిక మృతదేహం తరలించారు.
Also read: శంషాబాద్ ఎయిర్పోర్టులో తగ్గిన ప్రయాణికుల తాకిడి.. ఏకంగా 11 శాతం డౌన్, అవే కారణాలు