తెలంగాణ పోలీసులు వినూత్నంగా ప్రారంభించిన ‘గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలిసింగ్ను మరింత బలపరుస్తూ, పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందితో మమేకం కావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అబిడ్స్ ఎస్సై తన సిబ్బందితో కలిసి విక్రం సినిమాలోని పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు.
సిబ్బంది–అధికారుల మధ్య ఎలాంటి భేదభావాలు లేకుండా పనిచేయాలని సీపీ సూచించారు. సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని సజ్జనార్ ప్రాముఖ్యంగా చెప్పారు. కొత్తగా నియమితులైన సిబ్బందితో పరిచయాలు ఏర్పడి, పరస్పర అవగాహన పెరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పోలీసు సిబ్బంది తమ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడంతో పాటు, దాగి ఉన్న ప్రతిభను వెలికితీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు కూడా మారాలని శివధర్ రెడ్డి సూచించారు. ప్రజలకు దగ్గరవ్వడం, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం, ఏ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించటం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణను ఈ కార్యక్రమంలో భాగంగా అందిస్తున్నారు.
కమల్ హాసన్ 'విక్రమ్' సాంగ్కి ఓల్డ్ సిటీ పోలీసుల డ్యాన్స్.. వీడియో వైరల్ pic.twitter.com/C78IX0wWRs
— ChotaNews App (@ChotaNewsApp) November 22, 2025