Telangana Police: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పోలీసులు మరో ఘనత సాధించారు. పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధృవీకరణలో అత్యుత్తమ పనితీరు కనబరిచారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025-26లో పాస్పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణలో విశిష్ట సేవలు అందించిన రాష్ట్ర పోలీసు సంస్థగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేసింది. ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు అవార్డును ప్రకటించింది.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి డీజీపీ సీ.వీ.ఆనంద్ కు అధికారిక లేఖ అందింది. న్యూ ఢిల్లీలో ఈనెల 19న జరిగే కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసు ధృవీకరణ అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
దీంట్లో తెలంగాణ పోలీసులు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసుల సేవా నిబద్ధతకు, వృత్తిపరమైన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Also read: తలనొప్పితో జీవితం నరకంగా మారిందా? ఆ ఒక్క పొరపాటే ముఖ్య కారణం!