E-Paper
Advertisement

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు
Advertisement

TG High Court: శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా, అధికార పరిధి దాటి ప్రవర్తించినందుకు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు ఆదేశాల ఉల్లంఘన

Advertisement

వివాదాస్పద ఆస్తి స్థలంలోకి భారీ యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం పూర్తిగా చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కమిషనర్ స్పష్టంగా ఉల్లంఘించారని, ఇది న్యాయస్థాన ధిక్కరణ కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడింది.

రంగనాథ్ బదిలీకి సూచన

Advertisement

హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను వీలైనంత త్వరగా ఆ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో చట్టబంధంగా, నిబంధనల ప్రకారం పనిచేసే సమర్థుడైన మరొక అధికారిని వెంటనే నియమించాలని సూచించింది.

ప్రజాస్వామ్యంలో చట్టానిదే పైచేయి

ఏ సమాజంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలంటే ఒక్క చట్టపాలన మాత్రమే కొనసాగాలని ధర్మాసనం గుర్తుచేసింది. అధికారుల లేదా వ్యక్తుల ఆధిపత్య పెరిగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం రాసినట్లే అవుతుందని హెచ్చరించింది. రాజ్యాంగ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

Also Read: లోకేష్‌ చెంప పగలగొట్టాలి.. భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్!

Tags

Related News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

Big Stories

Advertisement
×