Telangana Rising Global Summit-2025: హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలిరోజు వివిధ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో ప్లూచర్ ప్రణాళికను ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వివరించారు. రెండరోజు షెడ్యూల్ ఏంటి?
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో రెండో రోజు అంటే మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, AI తోపాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
ఉదయం 9.30 కు ఎంసీహెచ్ఆర్డీ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ఆవిష్కరిస్తారు. సాయంత్రం మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
20 సమావేశాల్లో సీఎం రేవంత్
గ్రీన్ వెహికిల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్’ను ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో, ఫైర్ వర్స్తో Telangana is Rising–Come, Join the Rise థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహించనుంది ప్రభుత్వం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో మంగళవారం ఉదయం 10 గంటలకు అటవీ- పర్యావరణం, దేవాదాయ శాఖల ప్రగతి నివేదికపై కీలక ప్రసంగం చేయనున్నారు మంత్రి కొండా సురేఖ. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ముఖ్యమైన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. రానున్న రోజుల్లో తన శాఖలకు సంబంధించి అభివృద్ధి అంశాల విజన్ ఎలా ఉండనుంది అనేది వివరించనున్నారు. అనంతరం జరగనున్న ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొంటారు.
ALSO READ: మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి వైన్స్ బంద్