Intinti Ramayanam Today Episode December 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని రాజేంద్రప్రసాద్ ని టెన్షన్ పడొద్దు అని అంటారు. వాళ్లని అనడం నా తప్పే వాళ్లు చిన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అక్షయ్అం టారు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు లేరా నువ్వేం బాధపడకు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. మిమ్మల్ని అంత మాట అని లోపల నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే అనేసాను నాన్న నన్ను క్షమించండి అని అంటాడు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంటాడు. మీరు నాకు క్షమాపణ చెప్పడం కాదురా నేనే మీకు క్షమాపణలు చెప్పాలి.. అందరూ కలిసి ఉండాలని నా ఆలోచన కోసమే మీరు కష్టపడి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చారు..ఆరాధ్యను తీసుకురావడానికి వెళ్లిన మీనాక్షితో పోలీసులు ఇంటికి వస్తారు.. ఆ తర్వాత గొడవ పెద్దది అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అమ్మమ్మ అని అడుగుతుంది. సరే వెళ్లి తీసుకుందాం పద అనేసి మీనాక్షి అంటుంది. ఆరాధ్య నేను వెళ్లి తీసుకొస్తాను అని వెళుతుంది. అక్కడికి వచ్చిన ఓ దొంగ మీనాక్షి చేతిలో ఒక బ్యాగు పెట్టి ఈ బ్యాగు నువ్వు పట్టుకో నేను ఇప్పుడే వస్తాను అనేసి వెళ్తాడు. ఆ దొంగని తరుముకుంటూ వచ్చిన పోలీసులు అతను ఎవడు నీకు తెలుసా నీ చేతిలో ఎందుకు బ్యాగ్ పెట్టాడు అని అడుగుతారు. అక్కడికొచ్చిన ఆరాధ్య మా అమ్మమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. ఈమె మీ అమ్మమ్మ నా అయితే పదం మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అనేసి పోలీసులు ఇంటికి తీసుకొని వెళ్తారు. అది చూసిన అందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా నువ్వు పోలీసులతో పాటు వచ్చావ్ ఏంటి అని అవని అడుగుతుంది.
ఒక దొంగ బ్యాగు తెచ్చి మీ అమ్మ చేతిలో పెట్టాడు ఆ తర్వాత వాడి వెళ్ళిపోయాడు. ఆ దొంగకు మీ అమ్మకు ఏదో సంబంధం ఉందని మా అనుమానం.. అందుకే ఇక్కడికి వచ్చాము మీ ఐడి కార్డులు చూపించండి అని అడుగుతారు.. అవని అంత చెప్తున్న సరే ఆ కానిస్టేబుల్ మాత్రం ఐడి కార్డులు చూపించాలి అని గొడవ చేస్తారు.. ఇంక వాళ్ళ మాట కాదనలేక ఇంట్లోని వాళ్ళందరూ ఐడి కార్డులను చూపిస్తారు.. అందరూ చూపించారు కానీ ఈవిడ ఐడి కార్డ్ ఏది చూపించట్లేదు అని అంటారు.. ఇక లేదండి అని అనగానే పార్వతి వాళ్ళ అడుగుతున్నారు కదా చూపించండి అని అంటుంది..
మీ ఆయన గురించి మీరు మాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు కనీసం మీ ఇంటి పేరు అన్న చెప్పి వాళ్లకి ఐడి కార్డు చూపించండి అని ఇంట్లో వాళ్ళందరూ కూడా రచ్చ రచ్చ చేస్తారు.. అయితే అవని ఆవిడ మా అమ్మగారే నేను సాక్ష్యం ఇస్తాను ష్యూరిటీ లెటర్ కూడా రాసిస్తాను అని అంటుంది. అక్షయ్ ఎస్సై కి ఫోన్ చేసి మీకు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు ఏదో మాట్లాడుతున్నారు నువ్వే మాట్లాడు అని అంటాడు.. ఒక కానిస్టేబుల్ పల్లవి చెప్పిన ప్లాన్ ప్రకారమే అక్కడ చేసి వెళ్లిపోతారు.. వెళ్ళిన తర్వాత పల్లవి పెద్ద రచ్చ చేస్తుంది..
ఆగండి మీరు పోలీసుని ఇంటికి తీసుకొచ్చారు రేపు మమ్మల్ని అందరినీ క్రిమినల్స్ అనుకోరా అని పల్లవి అడుగుతుంది.. ఆ మాట వినగానే అవని ఇంకా ఆపు బయట ఎవరో ఎన్నో చేస్తూ ఉంటారు కానీ.. వాళ్ళందరి గురించి ఎంక్వయిరీలు చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలో అందరిని పోలీసులు విచారిస్తారు దానికి మనం క్రిమినల్స్ అయిపోతామని అడుగుతుంది.. పార్వతి పల్లవి నీ దాంట్లో తప్పేంటి..? తాను అన్నది కరెక్టే కదా అని పార్వతి పల్లవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.. కానీ అక్షయ్ మాత్రం వాళ్ళ అమ్మగారి గురించి మనకెందుకు ఇప్పుడు ఏం జరగలేదు కదా నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి పార్వతిని అక్షయ్ అంటాడు..
Also Read : రోహిణికి షాకిచ్చిన మీనా..మనోజ్ ను తిట్టిన బాలు.. సత్యంకు అనారోగ్యం..
ఇక పార్వతి నీళ్ల కోసం వస్తే అక్కడున్న మీనాక్షిని చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ అవనిని మీ అమ్మ గురించి ఏమీ మాట్లాడట్లేదు.. అసలు ఏం జరుగుతుంది మీ అమ్మకి కనీసం కొంచెం కూడా లేదు.. మీరు కూడా అక్రమ సంబంధం అని మాట్లాడుతున్నారా అని బాధపడుతుంది అవని.. అసలు మీ నాన్న గురించి కానీ ఇంటి పేరు గురించి కానీ మీ అమ్మ ఎందుకు చెప్పలేదు కనీసం నీకైనా చెప్పాలి కదా అని అంటాడు.. అక్షయ్ ఎంత అన్న కూడా అవని మౌనంగా ఉండిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..