E-Paper
Advertisement

Telangana: విద్యార్థులకు ముందస్తు కబురు.. అలా చేయకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కట్

Telangana: విద్యార్థులకు ముందస్తు కబురు..  అలా చేయకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కట్
Advertisement

Telangana: క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు.. బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురు అనే పాట గురించి చాలామందికి తెలుసు.  మూడు దశాబ్దాల కిందట టాలీవుడ్‌లో వచ్చింది  ‘గులాబీ’ మూవీ. ఈ లిరిక్స్ మాదిరిగా వ్యవహరిస్తే డిగ్రీ విద్యార్థులకు కష్టాలు తప్పవు.  డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రులేకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ క‌ట్‌ చేయాలనే ఆలోచన చేస్తున్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు.

కొద్దిరోజుల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలుకానుంది. గంపెడాశతో విద్యార్థులు డిగ్రీలో అడుగు పెట్టనున్నారు. ఈసారి మాత్రం స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నియమం రానుంది. అలా లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత కోల్పోతారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement

హైదరాబాద్‌లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఈ సమావేశంలో వారంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆఫీసులో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఏడు వర్సిటీల వీసీల సమావేశం జరిగింది. డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉండదు. ఆ తరహా ప్రభుత్వ ఆదేశాలు గతంలో ఉన్నాయని గుర్తు చేశారు.

ఇప్పటివరకు ఇది అమలు కాలేదని పలువురు వీసీలు ప్రస్తావించారు. ఈసారి విద్యార్థుల హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కచ్చితంగా ముడిపెట్టాలనే నిర్ణయానికి వారంతా వచ్చారు. దీనివల్ల విద్యార్థులు పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయన్నారు.

Advertisement

ALSO READ: తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు, ఆపై సునీతారావుకు ప్రశ్నలు

విద్యా నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండేవి. ఇప్పుడు వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు ఆయా వీసీలంతా. ఇకపై డిగ్రీ విద్యార్థులు తమ హాజరు విషయంలో తస్మాత్ జాగ్రత్త. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×