E-Paper
Advertisement

TGPSC Group 1: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత

TGPSC Group 1: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత
Advertisement

TGPSC Group 1 Mains Exams: రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 31,383మంది అభ్యర్థులు రాయనున్నారు.

మొత్తం రాష్ట్రంలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా.. ఆయా పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు, పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ ప్రకటించారు.

Advertisement

పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆయా కేంద్రాల నుంచి 200మీ. దూరం వరకు ఆంక్షలు విధించారు. మరోవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్‌లోని జీఓ 29 రద్దు చేసి పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని గత కొంతకాలంగా అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

జీఓ రద్దు, పరీక్షల తేదీలను మార్చమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా..కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.

నిబంధనలు..

  •  అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాక పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • ఇన్విజిలేటర్లుకచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
  • ఏదైనా ప్రభుత్వ ఐడెంటిటీ కార్డు తప్పనిసరి
  • బ్లూ లేదా బ్లాక్ పెన్ను, పెన్సిల్, రేజర్ అవసరం
  • పెన్సిల్ లేదా పెన్నుతోనే డ్రాయింగ్ వేయాలి. జెల్,స్కెచ్ పెన్స్ ఉపయోగించవద్దు.
  • పరీక్షలు పూర్తయ్యే వరకు ఒకే హాల్ టిక్కెట్‌ను ఉపయోగించాలి. హాల్ టిక్కెట్‌పై పేర్కొన్న స్థలంలో అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం చేయాలి.
  • జవాబులు రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.
  • అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి.
  • ఇతర భాషల్లో రాస్తే ఆ జవాబు పత్రాలను అనర్హమైనవిగా గుర్తిస్తుంది.
  • పరీక్ష రాయడానికి సహాయకులు అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్ టిక్కెట్లపై ‘స్క్రైబ్’ విషయాన్ని పేర్కొంటారు.
  • దివ్యాంగుల కోసం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు సదరం ధ్రువపత్రం తీసుకు రావాల్సి ఉంటుంది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×