E-Paper
Advertisement

Preethi : అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. చివరిసారిగా తల్లితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్..

Preethi : అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. చివరిసారిగా తల్లితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్..
Advertisement

Preethi : మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషంగానే ఉంది. తాజాగా నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ , ఎక్మోపై చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. కిడ్నీల పనితీరు మెరుగుపర్చేందుకు
డయాలసిస్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షిస్తోందని వివరించారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి తన తల్లితో ఫోన్ లో మాట్లాడారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. ఈ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తల్లి, కుమార్తె మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్ గా మారింది. సైఫ్ తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని ప్రీతి తల్లికి చెప్పింది.

Advertisement

తల్లితో ప్రీతి ఏం మాట్లాడిందంటే..?
” సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారు. నాన్న పోలీసులతో చెప్పించినా ఉపయోగంలేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరుతున్నాయి. నేను ఫిర్యాదు చేస్తే సీనియర్లు అందరూ కలిసి నన్ను దూరం పెడతారు. ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంపై హెచ్ వోడీ నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు”. ఇలా తన బాధనంతా ప్రీతి తల్లికి చెప్పింది. కుమార్తె ఆవేదన విన్న తల్లి.. తాను సైఫ్ తో మాట్లాడతానని చెప్పింది. ఈ లోపే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది.

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్‌ వైద్య విద్యార్థి సైఫ్‌ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్‌ కాలేజీ, ఎంజీఎం హెచ్‌ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్‌ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రీతిని సైఫ్‌ టార్గెట్‌ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఇప్పటికే ప్రకటించారు.

Tags

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×