Big Stories

Intermediate Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నిమిషం ఆలస్యం నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

Inter exam news today

- Advertisement -

Inter exam news today(Latest news in telangana): ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో ఆ నిబంధనలను సడలించింది ఇంటర్ బోర్లు. ఉదయం 9గంటల తర్వాత.. 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ పరీక్షలకు అనుమతించాలని తాజా నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్, పది పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవాల కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,80,000మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఇంటర్ పరీక్షలు.. మార్చి 19 వరకు కొనసాగనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News