E-Paper
Advertisement

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.

మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మల్కారంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం విద్యార్థులు వెళ్లారని తెలిపారు. ఈ దుర్ఘటనలో విద్యార్థులు ఇస్మాయిల్,జాఫర్‌, సోహైల్‌, అయాన్‌, రియాన్‌ తోపాటు ఉపాధ్యాయుడు యోహాన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు మధ్య వారేనని పోలీసులు తెలిపారు. విద్యార్థుల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×