E-Paper
Advertisement

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా
Advertisement

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.

మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మల్కారంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం విద్యార్థులు వెళ్లారని తెలిపారు. ఈ దుర్ఘటనలో విద్యార్థులు ఇస్మాయిల్,జాఫర్‌, సోహైల్‌, అయాన్‌, రియాన్‌ తోపాటు ఉపాధ్యాయుడు యోహాన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయసు మధ్య వారేనని పోలీసులు తెలిపారు. విద్యార్థుల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×