Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ సందడి చేస్తున్నారు. నామినేషన్ల లలోను, ప్రచారం లోను ట్రాన్స్ జెండర్లలతో కలిసి ప్రచారం చెయ్యడం సెంటిమెంట్గా భావిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు.. నామినేషన్ వేసేటప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా ప్రచారంలో ఇంటింటికి అభ్యర్థులతో కలిసి బొట్టు పెడుతూ గడపగడపకి తిరుగుతున్నారు.
సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆశీర్వాదాలు అందించే వీళ్లు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ట్రాన్స్జెండర్లను ప్రచారంలో భాగం చేసుకోవడం కూడా ఓ ‘సెంటిమెంట్ స్ట్రాటజీ’గా మారిపోయింది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో పలువురు సర్పంచ్ అభ్యర్థులు ట్రాన్స్ జెండర్లని తమ ప్రచారంలో భాగస్వామ్యం చేస్తున్నారు. నామినేషన్ దగ్గరి నుండి ప్రచారం వరకి ట్రాన్స్ జెండర్ల సహాయం కోరుతున్నారు. ట్రాన్స్ జెండర్లు ఆశీర్వాదం ఇస్తే తమకి కలిసి వస్తుందన్న సెంటిమెంట్ ని ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారు సర్పంచ్ అభ్యర్థులు.
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి సంపత్రావు నామినేషన్ వేయగానే.. భారీ ర్యాలీతో శోభాయాత్ర సాగింది.
ఈ ర్యాలీలో కీలక ఆకర్షణగా నిలిచింది ట్రాన్స్జెండర్ల బృందం.. సంపత్రావుకు ప్రత్యేక పూజలు చేసి, విజయశ్రీ అందాలని ఆశీర్వదించారు.
ర్యాలీ అంతా ‘సంపత్రావు గెలవాలి’ అంటూ నినాదాలు వినిపించాయి.
Also Read: తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద హై టెన్షన్.. మోహరించిన పోలీసులు
తిమ్మాపూర్ మండలం మహత్మనగర్ సర్పంచ్గా పొటీ చేస్తున్నా నల్ల నాగరాణితో కలిసి.. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ముత్తాయిదులకి బొట్టు పెట్టి సర్పంచుగా విద్యావంతురాలు నాగరాణిని గెలిపించాలని కొరుతున్నారు ట్రాన్స్ జెండర్లు