E-Paper
Advertisement

High court on Hydra : హైడ్రాపై హైకోర్టు కన్నెర్ర.. కమీషనర్ రంగనాథ్‌కు నోటీసులు

High court on Hydra : హైడ్రాపై హైకోర్టు కన్నెర్ర.. కమీషనర్ రంగనాథ్‌కు నోటీసులు
Advertisement

హైడ్రా సంస్థపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే సోమవారం ఉ.10:30 గంటలకు హాజరవ్వాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

శనివారం నోటీస్… ఆదివారం కూల్చివేత…

Advertisement

సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్‌లో ఇటీవలే హైడ్రా అధికారులు ఓ భవనాన్ని కూల్చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. ఈ ఘటనపై స్వయంగా కమిషనర్ రంగనాథ్, వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.

హాస్పిటల్ నిర్మాణానికి ఐదు అంతస్థుల భవనం విచారణ కోర్టు పరిధిలో ఉందన్న న్యాయస్థానం, కూల్చివేతలు ప్రారంభించే ముందు నోటీసులు ఇచ్చారా అని ఆరా తీసింది. కాల వ్యవధి లేకుండా శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొట్టడం ఏంటని నిలదీసింది. కోర్టు స్టేఉన్నా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Also Read : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

మూసీ బెడ్ పై సర్వే…

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది.
సర్కారు ఆదేశాల ప్రకారం అక్రమ కట్టడాలపై హైడ్రా దుమ్ము దులుపుతోంది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎక్కడికక్కడే నేలపాలు చేస్తోంది.

మరోవైపు మూసీ రివర్ బెడ్ మీద రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. అది పూర్తయ్యాక కూల్చివేతలకు హైడ్రా దూసుకొస్తుందని నదీ పరివాహక ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మూసీ నదీపై వేలాది ఆవాసాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు శాంక్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్లను అలాటెడ్ ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే వేగం పెంచేశారు.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×