E-Paper
Advertisement

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది. సీబీఐ విచారణకే మొగ్గుచూపింది.

సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం అడగగా.. అందుకు కూడా నిరాకరించింది.

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేయగా… ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు కొనసాగించింది. ఈక్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు ఆదేశించగా.. ఇవ్వొద్దంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిచింది.

ఈక్రమంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్డి తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా రద్దు చేశారు. ఈక్రమంలో సింగిల్ జడ్డి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. అయితే డివిజన్ బెంచ్ కూడా సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×