E-Paper
Advertisement

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్
Advertisement

Ts High Court: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది. సీబీఐ విచారణకే మొగ్గుచూపింది.

సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం అడగగా.. అందుకు కూడా నిరాకరించింది.

Advertisement

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేయగా… ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు కొనసాగించింది. ఈక్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు ఆదేశించగా.. ఇవ్వొద్దంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిచింది.

ఈక్రమంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్డి తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా రద్దు చేశారు. ఈక్రమంలో సింగిల్ జడ్డి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. అయితే డివిజన్ బెంచ్ కూడా సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×