E-Paper
Advertisement

Telangana RTC: రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్

Telangana RTC: రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్

Telangana RTC: తెలంగాణ మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ సందర్భంగా రాఖీలను, స్వీట్లను మహిళలు పంపించాలనుకున్న గమ్య స్థానాలకు 24 గంటలలోపే చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా గమ్య స్థానాలకు అనుకున్న సమయానికి రాఖీలను పంపిస్తామని తెలిపింది. రాఖీలతో పాటు స్వీట్లను చేరవేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా వంద కౌంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.

ఈ నెల 19వ తేదీన రాఖీ పండగ సందర్భంగా స్వయంగా రాఖీ కట్టే అవకాశం లేని మహిళలు, యువతుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాఖీ సందర్భంగా రాఖీలు, స్వీట్ల బట్వాడా కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. బక్ చేసిన కౌంటర్ నుంచి 24 గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని తెలిపింది.

Also Read: బోనాన్ని కోడితో ప్రారంభించిన భక్తుడు, వైరల్ ఫొటోలు

రాష్ట్ర వ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లను 9 వేలకు పైగా పార్శిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రాఖీ పండగ సందర్భంగా స్వయంగా రాఖీలను వెళ్లి కట్టలేని వారు. వారివారి అన్నలకు, తమ్ముళ్లకు పంపించవచ్చని తెలిపింది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×