E-Paper
Advertisement

Trending News: ఛీఛీ.. ఇంత కక్కుర్తి ఏంటి.. లంచంగా ఆలు గడ్డలు తీసుకున్న పోలీస్

Trending News: ఛీఛీ.. ఇంత కక్కుర్తి ఏంటి.. లంచంగా ఆలు గడ్డలు తీసుకున్న పోలీస్
Advertisement

Trending News: ఓ పోలీస్ ఆఫీసర్ లంచం పేరుతో చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లంచం పేరుతో ఏకంగా ఐదు కేజీల ఆలు గడ్డలను తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. లంచంగా ఆలు గడ్డలను తీసుకున్న కారణంతో కన్నౌజ్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆలు గడ్డలను లంచానికి కోడ్ గా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తొలుత నిజంగానే ఆలు గడ్డలు లంచంగా తీసుకున్నాడని అనుకున్నారు. కానీ చివరకు ఆలు గడ్డలను ఓ కోడ్ మాదిరి వాడుకున్నారని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేసి సస్పెండ్ చేశారు.

సాధారణంగా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు, కార్లు, బైక్ లు, నగలు వంటివి లంచంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా ఆలు గడ్డలు లంచంగా తీసుకున్నాడు అని తెలియడంతో అందరు మొట్టమొదటి సారిగా షాక్ అయ్యారు. కానీ వీటిని ఓ కోడ్ గా ఉపయోగించాడని తేలింది. కాగా, సారిఖ్ పోలీస్ స్టేషన్ లో భావల్ పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా రామ్ కృపాల్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ కేసుపై స్టేషన్ కు వచ్చిన వ్యక్తిని ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. ఈ తరుణంలో ఐదు కేజీల ఆలు గడ్డలు కావాలని డిమాండ్ చేశాడు.

Advertisement

అయితే విచారణలో భాగంగా బాధితుడిని విచారించగా అసలు నిజం బయటపడింది. లంచంగా అడిగింది ఆలు గడ్డలు కాదని తెలిపాడు. లంచంగా ఐదు కిలోలు ఇచ్చుకోలేనని, కేవలం రెండు కిలోలు మాత్రమే ఇవ్వగలను అని తెలిపాడు. అయితే తన డిమాండ్ తీర్చలేకపోతున్నట్లు తెలపడంతో ఎస్ఐ మండిపడ్డాడు. దీంతో చివరకు మూడు కిలోలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఎస్ఐ, బాధితుడి మధ్య సంభాషణకు సంబంధించి అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీంతో అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×